ఇండస్ట్రీ, అభిమానులకు బిగ్ గుడ్న్యూస్ చెప్పారు నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ దంపతులు. ఈ జంటకు ఆదివారం రాత్రి మగ కవలలు పుట్టారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా నయన్, విగ్నేష్ తెలిపారు. ఇండ్రస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూనే.. ఆశ్యర్చానికి గురుయ్యారు.
నాలుగు నెలల క్రితమే నయన్, విగ్నేష్లకు మహాబలిపురంలో అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. కనీసం నయన్ ప్రెగ్నెంట్ అని కూడా ఎక్కడ వినికిడి లేదు. పైగా ఈ మధ్యే నయన్ నటించిన గాడ్ఫాదర్ సినిమా రిలీజైంది. ప్రెగ్నెంట్ అయితే సినిమా కూడా చేయదుగా మరి పిల్లలు ఎలా.. అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే నయన్ స్వయంగా కవలల్ని కనలేదు. సరోగసీ పద్ధతిలో ఈ జంట తల్లిదండ్రులయ్యారు. పెళ్లికి ముందే ఈ జంట సరోగసిని ఆశ్రయించారు. అయితే వీరికి కవలలు పుట్టాకే నయన్ తల్లి, విగ్నేశ్ తల్లితో పాటు కుటుంబసభ్యులకు ఈ విషయం తెలిసింది. మొత్తానికి ఈ జంట అందరితోపాటు వారి ఫ్యామిలీకి కూడా గుడ్న్యూస్తో పాటు బిగ్ షాకింగ్ ఇచ్చారు.