కన్న తండ్రి శాడిజం వల్ల ఆ కూతురు 36 ఏళ్లు ఒకే గదిలో ఉండిపోయింది. ఆ రూమ్లో గొలుసులతో ఆమెను బంధించేశాడు. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు భోజనం తలుపు కింద నుంచే అందించేవారు. స్నానం కోసం నీటిని కిటికీ నుంచి వేస్తే ఆమె చేసేది. ఇంత అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది.
యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 53 ఏళ్ల సప్పా జైన్ మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. అందుకు ఆమె తండ్రి గిరీశ్ చంద్ 17 ఏళ్ల వయసులో ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి గొలుసుతో కట్టేశాడు. అప్పటి నుంచి ఆమెకు కుటుంబ సభ్యులు తలుసుకింద నుంచే భోజనం పంపేవారు. ఇక మల మూత్రాలు కూడా గదిలోనే. కిటికీ నుంచి నీరు పోస్తూ ఉంటే ఆమె స్నానం చేయించారు. సప్నా తండ్రి కొన్ని నెలల క్రితం చనిపోయాడు. దీంతో సాప్నా గురించి తెలుసుకున్న ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ సేవా భారతి సభ్యులు ఆమె ఇంటికి అధికారులతో వెళ్లి ఆమెను విడిపించి వైద్యం కోసం ఆగ్రాలోని ఓ హాస్పిటల్కి తరలించారు.