త్వరలో రెండు గ్రహణాలు రానున్నాయి. ఒకటి సూర్య గ్రహణం, రెండోది చంద్ర గ్రహణం. వీటి కారణంగా ఆ రెండు రోజులు తిరుమల శ్రీవారి దేవాలయాన్ని సంపూర్ణంగా మూసివేయనున్నట్లు తితిదే ప్రకటించింది. గ్రహణం రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు.
ఈ నెల 25న సూర్యగ్రహణం, వచ్చే నెల నవంబరు 8న చంద్ర గ్రహణం ఏర్పడతాయి. సూర్యగ్రహణం రోజున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 వరకు, చంద్రగ్రహణం రోజున ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. గ్రహణాల రోజుల్లో బ్రేక్, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ప్రకటించారు. కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే వెంకన్న దర్శనం కల్పిస్తామని చెప్పారు. గ్రహణాల సమయంలో అన్నప్రసాద పంపిణీ కూడా పూర్తిగా నిలిపివేయనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ఈ గ్రహణాల కారణంగా పూర్తిగా మూతబడతాయి.