గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్తుంది. ఇక జనవరి 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది.
అయితే ఎన్నికల సంసిద్ధను పరిశీలించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ ఈసీ అధికారులు విజిట్ చేశారు.గుజరాత్లో ఆమ్ ఆద్మీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేత కేజ్రీవాల్ ఇటీవల మాటిమాటికీ గుజరాత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ సర్కార్ నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవల బీజేపీ కేంద్ర నేతలు పర్యటిస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీ కూడా ఇటీవల అనేక కార్యక్రమాలను చేపట్టారు.