హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలోని పాపిరెడ్ది కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య పిల్లల్ని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కోహిర్కు చెందిన నాగరాజు, సుజాత దంపతులు. వీరికి సిద్ధప్ప, రమ్మశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు స్థానికంగా సేల్స్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. సుజాత ఇంట్లో ఉంటూ టైలర్గా పనిచేస్తోంది. అయితే నాగరాజుకు ఆమె భార్యకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో నాగరాజు భార్య, పిల్లల్ని టైలరింగ్ కత్తెరతో పొడిచి చంపేశాడు. అనంతరం తానూ ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.
మూడు రోజులుగా వారి ఇంటి తలుపులు మూసి ఉండడంతో పాటు దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు గమనించి ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా.. నాగరాజు కుటుంబం మృతి చెందడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫ్యామిలీకి ఆర్థిక సమస్యలు లేవని పోలీసులు తెలిపారు. హత్యలు, ఆత్మహత్యకు కారణాల కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.