Home / NATIONAL / ఫోల్డింగ్ ల్యాప్‌టాప్.. ధర రూ.3 లక్షలు.. స్పెషల్ ఏంటంటే!

ఫోల్డింగ్ ల్యాప్‌టాప్.. ధర రూ.3 లక్షలు.. స్పెషల్ ఏంటంటే!

ఇప్పటి వరకు ఫోల్డింగ్ ఫోన్స్ చూశాం.. వాడాం.. కానీ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ గురించి తెలుసా.. ఇప్పుడు మడత ల్యాప్‌టాప్ కూడా వచ్చేసింది. ఆసుస్ కంపెనీ ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసింది. ఆ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..

ప్రముఖ ఆసుస్ కంపెనీ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడీ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫస్ట్ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది.

ల్యాప్‌టాప్ ఫీచర్లు..

– 17.3 ఇంచ్ థండర్‌బోల్డ్ 4కే డిస్‌ప్లే
– ఫోల్డ్ చేసేటప్పుడు 12.5 ఇంచ్ స్క్రీన్
– మిగతా స్క్రీన్‌ను వర్చువల్ కీ బోర్డుగా ఉపయోగించవచ్చు
– బ్లూ టూత్ కనెక్టివిటీ కోసం నార్మల్ కీ బోర్డు
– ట్యాబ్, డిస్‌ప్లేలా రెండు రకాలుగానూ వాడుకోవచ్చు
– 12వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్
– ఇంటెల్ ఐరిస్ ఎక్స్‌ఈ గ్రాఫిక్ కార్డ్
– 5 ఎంపీ ఏఐ కెమెరా
– డాల్బీ అట్‌మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్లు, 4 యూఎస్‌బీ-సీ పోర్ట్‌
– అదనంగా 500 జీబీ ఎస్‌ఎస్‌డీ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ ఫ్రీ
– 5 స్క్రీన్ మోడ్స్.. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్‌టెండెండ్
– మల్టీ స్క్రీన్ ఫీచర్ డిస్‌ప్లేని ఒకేసారి 3 స్క్రీన్‌లుగా ఉపయోగించవచ్చు

ఈ ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ ధర రూ.3,29000గా ఆసుస్ కంపెనీ నిర్ణయించింది. ధర భారీగా తగ్గించి స్టార్టింగ్ ఆఫర్ ప్రైజ్ రూ.2,84,290కు అందించనుంది. ఈ ఆఫర్ నవంబరు 10 వరకే ఉంటుంది. అక్టోబరు 14 నుంచి సేల్ ప్రారంభమైంది. ముందుగా బుక్‌ చేసుకున్న వారికి రూ.27,100 విలువైన ఫ్రీ వారెంటీని అందిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat