Home / SLIDER / మునుగోడులో తీవ్ర ఉద్రిక్తత

మునుగోడులో తీవ్ర ఉద్రిక్తత

 తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన  కాన్వాయ్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఈటల వాహనం ధ్వంసమైంది. రాళ్ల దాడిలో ఈటల వ్యక్తిగత సిబ్బందితో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో బీజేపీ,టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనపై రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat