Home / SLIDER / కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయం

కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయం

కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వీధి లో,ఎర్నేని టవర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పూర్ణ ఫిజియో థెరపీ క్లినిక్ ను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రమాదాలు జరిగినప్పుడు శరీర భాగాలకు సరైన వైద్యం అందక జీవితాంతం అంగవైకల్యం తో బాధపడుతున్నారన్నారు.

అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటుచేసిన ఫిజియోథెరపీ క్లినిక్ తో సరైన వైద్యం అందించి అంగవైకల్యం నుండి కాపాడాలన్నారు. అన్ని రకాల వైద్యశాల లతో పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యా వైద్యం పారిశ్రామిక అభివృద్ధి రంగాలకు ప్రోత్సహిస్తుందన్నారు. కోదాడ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి పేరు తెచ్చుకోవాలని కోరారు .

ఈ సందర్భంగా క్లీనిక్ యాజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణచందర్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కొండా సైదయ్య, పట్టణ కౌన్సిలర్లు కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్, గుండెల సూర్యనారాయణ, ఒంటి పులి రమా శ్రీనివాస్, ఖదీర్ పాషా, మాజీ జెడ్పిటిసి భట్టు శివాజీ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అలసగాని జనార్ధన్,సర్పంచ్ శంకర్, టిఆర్ఎస్ నాయకులు నెమ్మాది దేవమణి ప్రకాష్ బాబు,బత్తుల ఉపేందర్, గన్న అశోక్,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat