పమిడిముక్కల మండలం వీరంకిలాకులో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కొడుకుతో ఆ తల్లి ప్రేమగా మాట్లాడి.. బాత్రూంకి వెళ్లమని చెప్పి పిల్లాడు తిరిగి వచ్చే సరిగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే తనతో మాట్లాడి ఇంతలో విగతజీవిగా మారిన కన్నతల్లిని చూసి ఆ కొడుకు ఏడ్చిన తీరు అక్కడున్నవారిని సైతం వెక్కివెక్కి ఏడ్చేలా చేసింది. భర్త వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నానని.. తన కొడుకును భర్త దగ్గర ఉంచొద్దని లేఖ రాసి మరీ ఆ ఇల్లాలు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయింది.
నందివాడ మండలం పోలుకొండకు చెందిన పాముల ప్రియాంక, తోట్లవల్లూరి మండలం పాముల్లంకకు చెందిన పవన్కుమార్కు 2014లో వివాహం జరిగింది. వీరికి 8 ఏళ్ల కొడుకు ఉమేశ్ ఉన్నాడు. పవన్కుమార్ స్థానిక పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. 8 నెలల క్రితం పవన్కు పమిడిముక్కల స్టేషన్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో వీరు వీరంకిలాకులో ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ నైట్డ్యూటీలో ఉన్నాడు.
ప్రియాంక ఉదయం కొడుకుతో ప్రేమగా మాట్లాడి బాత్రూంకి వెళ్లమని చెప్పి తర్వాత గది తలుపులు వేసుకొని ఉరివేసుకుంది. తిరిగివచ్చిన కొడుకు అమ్మా తలుపు తీయ్ అని ఎంత వేడుకున్నా తలుపులు తెరుచుకోలేదు. దీంతో ఆ పిల్లాడు కిటికీ లోంచి చూడగా తల్లి విగతజీవిగా వేలాడుతుండడాన్ని చూసి ఒక్కసారిగా గుండెలవిసేలా ఏడ్చాడు. దీంతో పక్కింటివారు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులకు ఆమె వద్ద నుంచి సూసైడ్ నోట్ లభించింది. అందులో తన భర్త ఎన్నో ఏళ్లుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని.. ఇక భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కొడుకును ఆయన వద్ద ఉంచొద్దని, తన అన్నయ్య దగ్గరకు పంపించాలని ఉంది. మృతిరాలి తల్లి ఫిర్యాదు మేరకు పవన్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు పోలీసులు.