మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన కేఏ పాల్పై రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశాడు. మునుగోడు నియోజకవర్గంపై కేఏ పాల్ తన స్నేహితులు ఐఎస్ఐఎస్, ఆల్ఖైదాను ఉపయోగించి బాంబ్ వేయనున్నాడని తెలిసిందని, ఆ ప్రాంతంలోని ప్రజలంతా పారిపోవాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
ఇదే కాకుండా జీసస్కు చెప్పి మునుగోడు ప్రాంతంలోని పంటపొలాల్లో పంటలు పండకుండా, అక్కడి ప్రజలకు ప్రాణాంతకమైన వైరస్ సోకేలా చేస్తాడని విన్నానని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగని ఆర్జీవీ ఇక కేఏ పాల్ 2024లో యూఎస్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాడని అప్పుడు రివేంజ్గా మునుగోడు నియోజకవర్గంపై న్యూక్లియర్ బాంబ్ వేస్తాడేమోనని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కేఏ పాల్పై ఆర్జీవీ వేసిన ఈ సెటైర్లకు నెటిజన్లు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు.