Home / POLITICS / భవిష్యత్‌లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తాం: జగదీష్‌రెడ్డి

భవిష్యత్‌లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తాం: జగదీష్‌రెడ్డి

కమ్యూనిస్టు పార్టీల ప్రచారం వల్లే మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌కు కూసుకుంట్ల, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోకలిసి జగదీష్‌రెడ్డి వెళ్లారు. టీఆర్‌ఎస్‌విజయానికి సీపీఐ, సీపీఎం శ్రేణులు కష్టపడ్డాయంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇతర నేతలతో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు పరస్పరం స్వీట్స్‌ తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. భవిష్యత్‌లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ మునుగోడు ఫలితంతో బీజేపీకి ఎండ్‌కార్డు పడిందన్నారు. కూసుకుంట్ల మాట్లాడుతూ సీపీఐ, సీపీఎం సహకారంతో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat