తెలుగు చిత్రసీమలో చక్కటి ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ద్వారా ప్రేక్షక్షకులకు చేరువైన యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు.
నవంబర్ 20న బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నాగశౌర్య పెండ్లి జరగనుంది. నవంబర్ 19న మెహందీ వేడుకతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు చేశామని నాగశౌర్య కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వధువు అనూష శెట్టి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. దీంతో ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా? లవ్మ్యారేజీనా? అంటూ సోషల్మీడియాలో చర్చలు మొదలయ్యాయి.