రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. కేంద్రం అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. యువత జీవితాన్ని నాశనం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన విమర్శించారు.
సిద్ధిపేటలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న యువతకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఇక ఆ శాఖలో మరో 2 వేల పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.