విశాఖ పట్నం సాగర తీరాన నేవీ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 18 వేలమంది యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పరుగులు తీశారు. ఈ మారథాన్.. ఫుల్ మారథాన్ 42కిలోమీటర్లు, ఆఫ్ మారథాన్ (21కే), 10కే, 5కే విభాగాల్లో జరిగింది.
ఆర్కే బీచ్ సమీపంలోని కాళికాదేవి ఆలయం ఆవరణలో నేవీ ఆఫీసర్లు, సినీ నటులు అడవి శేషు, మిలింద్ సోమన్ జెండా ఊపి మారథాన్ ప్రారంభించారు. ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు, నగదు బహుమతులు ఇచ్చారు.