ఆ ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారు. పాప ఎవరి దగ్గర ఉండాలని విషయమై జడ్జి ఆ చిన్నారిని అమ్మ కావాలా.. నాన్న కావాలా.. అని అడిగింది. దీంతో ఆ చిన్నారి తడుముకోకుండా చెప్పిన ఆన్సర్కు జడ్జి సైతం చలించిపోయారు. షాద్నగర్ పట్టణంలోని కోర్టులో శనివారం ఈ ఘటన జరిగింది.
కల్వకుర్తి పరిధిలోని మాడ్గుల గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు డివోర్స్ కావాలంటూ లోక్అదాలత్లో భాగంగా న్యాయమూర్తిని ఆశ్రయించారు. ఆ జంటకు 6 ఏళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం ఆ పాప తల్లి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో మరో సారి ఆ జంట శనివారం కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ చిన్నారిని జడ్జి సీఎం రాజ్యలక్ష్మి పిలిచి నీకు అమ్మ కావాలా.. నాన్న కావాలా.. అని అడిగింది. దీంతో ఆ పాప నాకు అమ్మానాన్న ఇద్దరూ కావాలని చెప్పింది. పాప చెప్పిన ఆ జవాబుతో జడ్జి చలించి పాపను అక్కున చేర్చుకున్నారు. అనంతరం భార్యభర్తలు విడిపోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అక్కడున్నవారికి అవగాహన కల్పించారు. ఇక ఆ భార్యభర్తలు కలిసి ఉండాలని కోరి అందుకు వారికి 15 రోజుల గడువు ఇచ్చారు.