తాజాగా విడుదలైన యశోద మూవీ హిట్ టాక్ సాధించడంతో మంచి జోష్ లో ఉంది సూపర్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు తాను కష్టాలు పడినట్లు చెప్పుకోచ్చింది. సరిగ్గా తనకు 14 సంవత్సరాల వయసులోనే తను పనిచేయాల్సి వచ్చిందని తాజాగా ప్రముఖ చానెల్ కిచ్చిన ఓ ఇంటర్వూలో తెలిపింది సమ్ము.
మ్యారేజ్ ఫంక్షన్లలో వెలకమ్ చేసే అమ్మాయిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 3గంటలు నిల్చొని గెస్ట్లకు వెల్కమ్ చెబితే రూ.800 నుండి రూ.1000 ఇచ్చేవారని చెప్పింది. పొద్దున చదువుకుని.. సాయంత్రం పనిచేసేదాన్ని అంటూ పాత రోజుల్ని గుర్తుచేసుకుంది.
మోడల్గా కెరీర్ ప్రారంభించిన సమంత, ఏమాయ చేశావే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’, ‘ఖుషీ’ సినిమాలు చేస్తుంది.ఇటీవలే సమంత ‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన పడినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఇటీవలే యశోద ప్రమోషన్లో చెప్పుకొచ్చింది.