తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దమ్ముంటే విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వంతో అమలు చేయించాలని ఆయన ఈ సందర్భంగా బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ఆ తర్వాతే యాత్రలు చేయాలన్నారు. హనుమకొండలో ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చాలనుకుంటే ప్రజలు సహించరని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతున్నదని విమర్శించారు. ఈడీ, ఐటీ దాడులతో కేసీఆర్ కుటుంబం సహా, మంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొడతామన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ ఆవిర్భావం జరిగిందని చెప్పారు. నవంబర్ 29న దీక్ష దివస్ను ఘనంగా జరుపుకొంటామన్నారు. మంగళవారం నుంచి డిసెంబర్ 9 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.