ఏపీ అధికార వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న గడప గడప కు కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రక్షణనిధి కి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడకెళ్లినా కానీ ప్రజల నుండి చేదు అనుభవాలు, నిరసన సెగలు తప్పడం లేదు.
తాజాగా తిరువూరు ఎమ్మెల్యేకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో రక్షణనిధి పర్యటించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మా గ్రామానికి ఏం చేశారు అని రక్షణనిధిని గ్రామస్తులు నిలదీశారు.
మా ఊరులో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులకు, ఎమ్మెల్యేకు మధ్య వాదన చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్థానికులకు సర్దిచెప్పి కార్యక్రమాన్ని కొనసాగించారు.