తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ తోనే పొత్తు కొనసాగిస్తామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఇరు పార్టీల అంగీకారంతోనే తమ పొత్తు ఉంటుందని అన్నారు.
ఈ రోజు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. దేశం మరో శ్రీలంక కాబోతుందని, రాబోయే రోజుల్లో ప్రజలనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.అసమానతలపై దేశం 120 వ స్థానంలో ఉందన్నారు.
నిరుద్యోగంలో వందవ స్థానం, ఆకలి సమస్యలలో 107వ స్థానం ఉందని పేర్కొన్నారు. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రజలను మోసం చేసే పద్ధతిని నరేంద్ర మోదీ అవలంబిస్తున్నారని అన్నారు. దేశ సంపదలో 75శాతం అంబానీ చేతుల్లోనే పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.