ప్రపంచం సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ సైబర్ దాడులూ పెరుగుతున్నాయి. ఇటీవల ట్విట్టర్కు సంబంధించిన 54 లక్షల మంది యూజర్ల డాటాను ఓ బగ్ సాయంతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. సదరు సమాచారాన్ని హ్యాకర్స్ ఫోరంలో బహిర్గతం చేశారు.
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సమాచారం భారీస్థాయిలో సైబర్ నేరగాళ్ల చేతికి పోయినట్టు వార్తలు వెలువడ్డ కొద్దిరోజుల్లోనే ఇది జరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. వేరేరకం ట్విట్టర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ను ఉపయోగించి దుండగులు 14 లక్షల మంది ట్విట్టర్ యూజర్ల ప్రొఫైల్స్ను దొంగిలించి తమలో తాము పంచుకున్నారని తెలుస్తున్నది.