politics భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో చోటు దక్కలేదు. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.. అలాగే సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని.. వాటిలో తనకు ఛాన్స్ వచ్చే సూచనలు ఉన్నాయని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి.. వర్గాలుగా విడిపోయి అంతర్గత పోరు రోజురోజుకీ పెరిగిపోతుంది. సీనియర్ నేతలు అందరూ బయటకు వచ్చి తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. అలాగే అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలియని వారికి సీట్లు ఇస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే తాజాగా బోనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అసహనాన్ని ప్రదర్శించారు.. ప్రెస్ మీట్ పెట్టి మరి తనకు సిటీ ఇవ్వలేదని కానీ తొందరలో కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని అప్పుడు తనకు సీటు వచ్చే అవకాశం ఉందని అన్నారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆరోపించారు.
అలాగే ఈయన గురించి ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ గా మారింది తాజాగా కోమటిరెడ్డి ప్రధాన నరేంద్ర మోడీని కలవడానికి వెళ్లనున్నారని సమాచారం.. అలాగే ఏ విషయం మాట్లాడటానికి ఈ ప్రధాన కలుస్తున్నారా మాత్రం పూర్తిగా తెలియలేదు కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద గొడవలు జరుగుతున్న సమయంలో ఈయన ప్రధానిని కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఎంపీ హోదాలో ఉండి ప్రధానిని కలవనున్నారా లేక పార్టీ మరి ఉద్దేశంతో ప్రధాని కలవడం ఉన్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది..