Politics పాకిస్తాన్ చైనా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఉగ్రహవాదాన్ని పోషించే కొన్ని దేశాలు వాటి తీరు ఎప్పుడు అలాగే ఉంటుంది కదా అంటూ సమర్ధించడంతో తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసింది..
భారత్ పాకిస్తాన్ చైనా తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది వాటి తీరి ఎప్పుడు అలాగే ఉంటుంది కదా ఆ దేశాలను వెనకేసుకొని వచ్చిన వారిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై శంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. అలాగే ఉగ్రవాదానికి ఓతమిచ్చే వారిని రక్షించడానికి కొన్ని అంతర్జాతీయ వేదికలను మరికొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయి అంటూ మండిపడ్డారు..
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కొన్ని దేశాలకి ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇతర దేశాలకు ప్రబోధించే అర్హత ఉంటుందా అంటూ ప్రశ్నించారు ఈ సందర్భంగా పరోక్షంగా చైనా పాకిస్తాన్ దేశాలను దుమ్మెత్తి పోశారు.. ఐక్యరాజ్యసమితి భద్రత మండల చర్చ కార్యక్రమంలో మాట్లాడిన జై శంకర్ పాకిస్తాన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండల్ లో అంతర్జాతీయ శాంతిభద్రతలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు దీంతో అక్కడే ఉన్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. అలాగే ఆల్ ఖైదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించి, తమ పొరుగు దేశ పార్లమెంటుపై దాడి చేసిన వారు ఈ వేదికపై ప్రసంగించలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత కుట్రదారులు, 26/11 ఉగ్రదాడులకు పాల్పడిన వారిని రక్షిస్తూ.. వారిని శిక్షించకుండా చేస్తున్న వారికి మాట్లాడే అర్హతే లేదంటూ పేర్కొన్నారు.