Politics ప్రముఖ చిట్ఫండ్ కంపెనీ మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా ఈ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు..
నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి చిట్టీల సొమ్మును ఇతర సంస్థల్లోకి మార్గదర్శి చిట్ఫండ్ ప్రయత్నాలు జరిపించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపంలో నేపథ్యంలో మార్గదర్శ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.. అలాగే ఈ విషయంపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇప్పటికే దర్యాప్తును చేపట్టిన సంగతి తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. ఇక్కడ లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్లో ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది ఎంతమంది మార్గదర్శకులు డిపాజిట్ చేశారు అన్న విషయాలను వారికి అందించడానికి మార్గదర్శి అధికారులు సమ్మతంగా లేనట్టు తెలుస్తోంది అయితే ప్రజల సొమ్మును పక్కదారి పట్టించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక పత్రాలను ఇప్పటికే పలుమార్లు రిజిస్ట్రేషన్ అధికారులు కోరగా దీనిపై మార్గదర్శి ఎలాంటి నివేదిక ఇవ్వలేదు.. దీంతో నిధులు దుర్వినియోగం జరుగుతుందా అంటూ పలు ఆరోపణలు ఎదురయ్యాయి ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో అధికారులు దర్యాప్తును చేపట్టారు అలాగే ఇప్పుడు నిర్వహిస్తున్న సోదాల్లో పలు కీలక విషయాలు బయటపడితే దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపారు.. అయితే ఈ సోదాలు మరికొన్ని రోజులు జరుగుతాయా లేక ఈరోజు తో పూర్తవుతాయా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది..