Home / NATIONAL / తెలంగాణ కాంగ్రెస్ కు షాక్

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగలనున్నదా..?. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఆ పార్టీని వీడనున్నారా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శుక్రవారం పీఎంఓ ఆఫీసులో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు.

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిథిలోని పలు అభివృద్ధి పనులకోసం కలిశారు అని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ సమావేశంలో మూసీ ప్రక్షాళనపై కేంద్రం దృష్టిసారించాల్సిందిగా కోరనున్నారు.

రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో ప్రవహించే మూసీ నది ప్రక్షాళన కోసం రూ.3వేల కోట్లు విడుదల చేయాలని ప్రధానిని అడుగుతారని సమాచారం. అయితే ఈ భేటీ పార్టీ మార్పు కోసమే అని.. ఇటీవల తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి.. మునుగోడు ఉప ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత పార్టీ మార్పుపై ఓ క్లారిటీ కోసమే ఈ కలయిక అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat