తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీస్కున్నారు. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తాను బరిలో దిగే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ క్రమంలోనే పాలేరులో వైఎస్సార్టీపీ కార్యాలయాన్ని పాలేరులో నిర్మించాలని షర్మిల ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతానికి ఒక్క హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మాత్రమే ఆ పార్టీకి చెందిన కార్యాలయం ఉంది. తాజా షర్మిల తీసుకున్న నిర్ణయంతో పాలేరు నుండి బరిలోకి దిగడం ఖాయమైంది.
పాలేరు ప్రజలతో సంబంధాలను పెంచుకోవడం కోసం షర్మిల పాదయాత్ర పేరుతో పాలేరు అంతటా తిరగాలని ఓ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.