Politics రాహుల్ గాంధీ తన భారత జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్లో పర్యటిస్తూ భారత్ చైనా సరిహద్దుల ఉద్రిక్తత పై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మనపై యుద్ధానికి వస్తుంటే భారత్ ప్రభుత్వ మాత్రం మొద్దు నిద్ర లో ఉంది అంటూ చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా మండిపడ్డారు..
ఓవైపు చైనా మన మీదకు దాడికి వస్తుంటే భారత్ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఇలా అయితే త్వరలోనే పెను ప్రమాదం తప్పదు అంటూ భారత్ చూడా యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
“రాహుల్ గాంధీ ప్రకటనపై ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. డోక్లామ్ సంఘటన జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఆయన ఇలాంటి కామెంట్సే చేశారు. బహుశా రాహుల్ గాంధీకి మన దేశ సైన్యంపై విశ్వాసం లేకపోవచ్చు. ఇది 1962 నాటి భారతదేశం కాదు. ఇది 2014 తరువాతి భారతదేశం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దూసుకుపోతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో సైన్యానికి అవసరమైన యుద్ధ విమానాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, స్నో బూట్లు కొనలేకపోయింది. సైన్యం కోసం మీరు చేసిందేంటి.. నేడు భారతదేశంలో 300 కంటే ఎక్కువ రక్షణ సామాగ్రి తయారవుతోంది. ఇది స్వావలంబన భారతదేశం. భారత్ ఇప్పుడు రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోవడం లేదు.. ఎగుమతి చేసే స్థాయిలో ఉంది. డోక్లామ్ ఘటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత సైన్యాన్ని కలిసి వారిలో విశ్వాసాన్ని నింపారు.. ” అని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి.