Politics కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే దీని వలన ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మరణించారు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కరోనా చైనాలో మాత్రం తగ్గటం లేదు ఇంత జరుగుతున్నా చైనా మాత్రం ఈ విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు సరి కదా తమ పౌరుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టు తెలుస్తోంది..
ప్రస్తుతం చైనాలో జీరో కోవిడ్ విధానాలను ఎత్తివేశారు.. దీంతో అక్కడ కరోనా విలయతాండవం చేస్తుందంటూ అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది.. రోజురోజుకీ అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుందని ప్రభుత్వం ఈ విషయంపై ఏమి చేయలేం అంటూ ఇప్పటికే చేతులెత్తేసింది అంటూ తెలిపింది ఇలానే పరిస్థితి కొనసాగితే వచ్చే సంవత్సరం ఏకంగా 10 లక్షల మంది కరోనాతో చైనాలో ప్రాణాలు కోల్పోయి అవకాశం ఉందని తెలిపింది..
అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి చైనాలో కరోనా తీవ్ర స్థాయికి చేరుతుందని తెలిపింది దీనివలన మొత్తం జనాభాలో మూడోవంతు మంది కరోనా బారిన పడతారని కూడా అంచనా వేసింది అయితే కరోనా సమయంలో చైనా తీవ్రమైన ఆంక్షలు విధించింది దీంతో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఆంక్షలు నేపథ్యంలో అక్కడ ప్రజలు తిండి లేక అలమటించారు వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది దీంతో జనాలు రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేయడంతో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేసింది దీంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది..