Politics తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఇప్పటికే రావణ్ రెడ్డిని పలువురు వ్యక్తులు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే అలాగే తాజాగా కాంగ్రెస్ నుంచి బిజెపికి మారిన మర్రి శశిధర్ రెడ్డి రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు…
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో పలు వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా కమిటీల కూర్పు వివాదంలో సీనియర్లకు ప్రాధాన్యత లేదంటూ ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భేటీలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగానే ఆయనను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే అలాగే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వాదనలు సరైనవి కాదంటూ కాంగ్రెస్లో సీనియర్లు కలిసి పోవాలంటే ఇప్పటికే పలమార్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే వీటన్నిటికీ తోడు కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి మారిపోయిన మర్రి శశిధర్ రెడ్డి తాజాగా రేవంత్ రెడ్డిని తనదైన శైలిలో విమర్శించారు..
అలాగే ఈయన.. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ బాగుపడదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్ఎఎస్, కాంగ్రెస్లకు ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు. 2023లో తాము అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించటం కాదని.. తానే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.. అలాగే తాను ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పై ఎన్నో వ్యాఖ్యలు చేశానని వాటిని ఏ విధంగా కూడా స్పందించలేదని తెలిపారు..