Politics ప్రధాని నరేంద్ర మోడీ తల్లి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి అయితే అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఆయన విధులకు హాజరయ్యారు ఈ విషయంపై దేశమంతా చలించిపోయింది అంతేకాకుండా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ విషయంపై స్పందించి సంతాపం వ్యక్తం చేశారు..
ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు తల్లి చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ మరోపక్క దేశ ప్రధానిగా తన అధికార కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం రాకూడదని వీడియో కాన్ఫరెన్స్ కు సిద్ధమయ్యారు. వర్చువల్ గా కోల్ కతా నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా ఊపారు.. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ రెస్ట్ అన్న మాటలకు ప్రధాని మోడీ చలించిపోయారు.
తల్లిని కోల్పోయి ఎంత బాధలో ఉన్నా ప్రధాని మోదీ వెంటనే వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కావడంపై
పశ్చిబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘‘పశ్చిమబెంగాల్ ప్రజల తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. ఈరోజు మీకు ఎంతో విషాదకరమైన రోజు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి’ అని దీదీ అన్నారు. మమత బెనర్జీ అన్న ఈ మాటలకు చలించిపోయారు మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం దేశాన్ని కదిలిస్తున్నాయి అంతటి దుఃఖంలో కూడా తన బాధ్యతను మరిచిపోని మోడీ వ్యక్తిత్వానికి అందరూ సలాం చెబుతున్నారు..