తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ఆకర్షణీయంగా నిలిచాయని, దేశవ్యాప్తంగా ఈ పథకాలను ప్రజలకు అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేలకొల్పబడిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదింటి ఆడబిడ్డల పెళ్ళికానుక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు పంపిణీ చేశారు.
లబ్ధిదారులకు చెక్కుతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పెళ్లికూతురుకు పెళ్లి కానుక తన సొంత ఖర్చులతో చీరను బహుకరణ చేశారు. అనంతరం కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని, చేపట్టని సంక్షేమ పథకాలను బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది..
నాటి ప్రభుత్వాలు ఎన్నడు పేదింటి ఆడబిడ్డల పెళ్ళిలకు అండగా నిలవలేదని, వారిని కూడా ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మదిలో మిగిలిన గొప్ప ఆలోచన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం అన్నారు. అండగా నిలిచే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ఆశీస్సులు అందజేయాలని అన్నారు.