Politics దేశంలో చాలా రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉంది దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి హవాను ప్రస్తుతం నడుస్తుందని చెప్పవచ్చు అయితే తాజాగా ఈ సందర్భంగా త్రిపుర సీఎం మాణిక్ సహో బిజెపి గంగా నది లాంటిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు..
ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ప్రస్తుతం అక్కడ బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే అలాగే మళ్లీ ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు మాణిక్ సాహో.. అంతేకాకుండా త్రిపురలో కమ్యూనిస్టుల పాలన ఇప్పటివరకు అందర్నీ అంచి వేసిందని అన్నారు అంతే కాకుండా బిజెపి గంగానది లాంటిది అంటూ వ్యాఖ్యానించారు..
త్రిపుర సీఎం మాణిక్ సహో బీజేపీ గంగా నది లాంటిదని వ్యాఖ్యానించారు. తాజాగా దక్షిణ త్రిపుర కక్రాబన్లో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గంగా నదిలో స్నానం చేస్తే ఎలా అని పాపాలు తొలగిపోతాయో అలాగే తన పార్టీలో చేరితే అంతటి పుణ్యం వస్తుందని అన్నారు.. అలాగే ‘ఇంకా స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను నమ్ముతున్న వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. మీరంతా బీజేపీలో చేరండి. మా పార్టీ గంగానది లెక్క. ఇందులో చేరితే గంగానదిలో పవిత్ర స్నానం చేసినట్లే. పాపాలు తొలగిపోతాయ్’ అని అన్నారు. అలాగే ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బిజెపి అధికారంలోకి వచ్చి ప్రజల కోసం ఎంతో సహాయపడుతుందని తెలిపారు..