Home / POLITICS / Politics : అవసరం అయితే మంత్రి పదవి వదిలేస్తా.. ధర్మాన ప్రసాదరావు

Politics : అవసరం అయితే మంత్రి పదవి వదిలేస్తా.. ధర్మాన ప్రసాదరావు

Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవసరమైతే మంత్రి పదవి అయిన వదిలేస్తాను కానీ తమ ప్రాంత ప్రజల కోసం పోరాడకుండా ఉండటం అంటూ చెప్పుకొచ్చారు..

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు రాజకీయాలు సరవేగంగా నడుస్తున్నాయి వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పలు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగానే దూషణాలకు దిగుతున్నారు ఈ సందర్భంగా
ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

అలాగే శ్రీకాకుళం పట్టణంలోని పోట్టి శ్రీరాములు మార్కెట్లో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. అవసరమైతే తాను మంత్రి పదవి నైనా వదిలేస్తాను కానీ తమ ప్రాంత ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటానని అన్నారు.. అలాగే తాను భూములు దొబ్బేశాడని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం తాను రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ సెంటు భూమి కూడా ఎవరికి ఇచ్చే అధికారం లేదని మరి అలాంటప్పుడు ఏకంగా భూములు దొబ్బేసే అవకాశం తనకు ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు.. అలాగే క్యాబినెట్లో మాత్రమే భూములు ఈ అవకాశం ఉంటుందని అన్నారు అలాగే తన మొత్తం రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర నుంచి అయినా ఒక రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే వెంటనే తన మంత్రి పదవిని వదిలేస్తానని అన్నారు తమ ప్రాంత ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్తామని వారి శ్రేయస్సు కోసం కష్టపడతామని అన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat