Home / SLIDER / కంటి వెలుగు ప్రారంభంలో పాల్గొన‌నున్న ఇత‌ర రాష్ట్రాల సీఎంలు : మంత్రి హరీశ్‌రావు

కంటి వెలుగు ప్రారంభంలో పాల్గొన‌నున్న ఇత‌ర రాష్ట్రాల సీఎంలు : మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దశ కంటి వెలుగు ప్రారంభం ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారని ఆయన తెలిపారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సు లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కంటి సమస్యతో ఎవరు బాధపడవద్దని రెండవ దశ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు.

జనవరి 18 నుంచి జూన్ 30వరకు జరిగే రెండవ దశ కంటి వెలుగు లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. తొమ్మిది నుంచి సాయంత్రం 4గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం కంటి పరీక్ష చేస్తారని మంత్రి చెప్పారు. జిల్లాకు అదనంగా 35మంది వైద్యులను రిక్రూట్ చేశామని పేర్కొన్నారు.ఉదయం ఇప్పటికే 10లక్షల కళ్ల అద్దాలు ప్రతి జిల్లాకు చేరుకున్నాయని వివరించారు.

రెండో దశ కంటి వెలుగుకు రూ. 250కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. జిల్లాలో 45 వైద్య బృందాలు, మరో మూడు అదనపు బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచం లోనే సామూహిక కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణలో తప్పా దేశంలో ఎక్కడా లేదన్నారు.ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్, యాదవ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఒడితెల సతీశ్‌, ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచ్‌వో కాశీనాథ్ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat