Home / HYDERBAAD / ఎమ్మెల్యే కెపీ కు కృతజ్ఞతలు తెలిపిన సుభాష్ నగర్ వాసులు.

ఎమ్మెల్యే కెపీ కు కృతజ్ఞతలు తెలిపిన సుభాష్ నగర్ వాసులు.

సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక దృష్టి వహించి ప్రత్యేక జీవో ద్వారా రూ.56 కోట్ల నిధులు గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారిచే మంజూరు చేయించి ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేసినందుకు ఈరోజు సుభాష్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అడప శేషు గారి ఆధ్వర్యంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో కంకర రాళ్ళ బాట ఉండేదని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి కృషితో రోడ్డు ఏర్పాటైందని, అయిన సింగిల్ లైన్ కావడంతో నిత్యం రద్దీ ఉండేదని, ట్రాఫిక్ ను అధిగమించేందుకు ఎమ్మెల్యే గారు సిగ్నల్ కూడా ఏర్పాటు చేయించారని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ చూపి ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

రాబోయే రోజుల్లో తామంతా ఎమ్మెల్యే గారి వెంటే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కటింగ్ శ్రీనివాస్, ప్రసాద్, నర్సింగ్, కొండన్న, సంతోష్ రెడ్డి, సుబ్బారావు, నారాయణ రాజు, సత్యనారాయణ, లత గౌడ్, లక్ష్మీ, పాస్టర్ కళ్యాణ్, రామకృష్ణ, శేఖర్, బాబులాల్, రాఘవులు, రమణ, రామ్ నివాస్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat