ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా రాక్షస పాలన సాగుతుందని ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు చేస్తున్న పాదయాత్ర అడ్డుకోవడానికి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారన్నారు బుద్ధా వెంకన్న. టీడీపీ అధినేత.. మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి.. ఆయన తనయుడు నారా లోకేష్కి ప్రాణ హాని ఉందన్నారు. పాదయాత్రకు సంబంధించి డీజీపీకి ఎప్పుడో అప్లై చేశామని.. ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదని బుద్దా వెంకన్న తెలిపారు.
అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని.. దానిని ఆపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్నారు. కేంద్ర ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు ప్రత్యేక బలగాలు ఇవ్వాలన్నారు.