Minister amarnath: ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖ గురించి మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతుందని…. ఎలా అయినా విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు.
విశాఖలో ఈరోజు ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సు జరిగింది. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. త్వరలో అదాని డేటా సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు. విశాఖను ఐటీ హబ్ చేయడమే మా లక్ష్యం అని మంత్రి అన్నారు. ఈ సదస్సులో మంత్రితో పాటు పలువురు ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు.