దళపతి విజయ్ ప్రధాన పాత్రలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారసుడు’ . విజయ్కు జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించాడు .
ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ను రాబట్టింది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 10 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావడం, కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో చిత్రబృందం అమెజాన్తో మరో డీల్ను కుదుర్చుకుందట.