తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సెంట్రాఫ్ యాక్షన్ గా నిలిచిన ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొదటిసారిగా తన పార్టీ నేతలకు వ్యతిరేకంగా గళం విప్పారు.
ఇకపై మీ ఆటలు, దౌర్జన్యాలు సాగవంటూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఖమ్మం నుండి ఎంపీగా గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారంటూ మండిపడ్డారు.
దీంతోపాటు తన వర్గానికి ఒక్కరికి కూడా పదవులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ఆయన ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు.