MINISTER GANGULA: ఆగస్టు నుంచి కరీంనగర్ వైద్య కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.
ప్రభుత్వ వైద్య కళాశాల…..2 నెలల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని వెల్లడించారు. శాశ్వత భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ చే భూమిపూజ చేయిస్తామని వివరించారు. కరీంనగర్ లో 2 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నా నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్నామని తెలిపారు.
శాశ్వత భవన నిర్మాణం ప్రస్తుతం టెండర్ దశలో ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కనుమళ్ల విజయ, నగర మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జిల్లా కలెక్టర్ కర్ణన్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణీ హరి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రెడ్డవేని మధు, వైద్య కళాశాల ప్రిన్సిపల్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.