Politics ఉగాది సంబరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది ఈ సందర్భంగా ఉగాది కానుకగా పలు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది..
ఉగాది సందర్భంగా అందించే పలు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంతేకాకుండా ఈ నేపథ్యంలో వాళ్ళకి కీలక నిర్ణయాలను సైతం తీసుకుంది ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం అంగీకారం తెలిపింది..
ఈ మేరకు కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా కర్నూలు జిల్లా డోన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్తగా తాడేపల్లి గూడెంలో రెవెన్యూ డివిజన్, పోలీస్ డివిజన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 500 మెగావాట్ల ఆదాని హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. అలాగే కల్యాణమస్తుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కల్యాణమస్తు, షాదీ తోఫాను ఈనెల 10నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. . వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. చిత్తూరు డైరీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 106 కోట్ల మాఫీకి ఏపీ కెబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది. ఏపీలో విద్యా వైద్యం పరిశ్రమలు మంచిగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పుకొచ్చారు జగన్..