తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు అన్నారు. నేడు మహశివరాత్రి సందర్భంగా మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గోన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శశoగా నిలుస్తున్నదని వెల్లడించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు వనదుర్గాదేవికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుటూ.. మెదక్ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయరన్నారు.రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు.