Home / ANDHRAPRADESH / law nestam: లా నేస్తం నిధులు విడుదల

law nestam: లా నేస్తం నిధులు విడుదల

law nestam: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్లా నేస్తం నిధులను విడుదల చేశారు. మూడేళ్లుగా లా నేస్తం నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లాయర్లకు ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పడానికే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రస్తావించారు. న్యాయవాది వృత్తి అనేది వాళ్ల కాళ్ల వాళ్లు నిలబడి సంపాదించుకునే వృత్తి అని ముఖ్యమంత్రి అన్నారు.

మేం ప్రవేశపెట్టిన లా నేస్తం పథకం వాళ్లకి భరోసా కల్పిస్తే……కచ్చితంగా ప్రజలకు చేరువ అవుతుందనే నమ్మకంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి అన్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా 2011 మందికి నగదు జమ చేసినట్లు స్పష్టం చేశారు.

ఏరకమైనా ఇబ్బందులు వచ్చినా ….ప్రభుత్వం ఆదుకుంటుందని వాళ్లకి గుర్తుకురావాలనేది మా ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. సంవత్సరానికి 2 సార్లు నగదు అందజేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

న్యాయవాదులను ఆదుకునేందుకు 100 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్ సమయంలోనూ వాళ్లకు చేదోడుగా ఉండేందుకు కార్పస్ ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. కార్పస్ ఫండ్ కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్టు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర అవసరాలకై ఈ ఫండ్ నుంచి ఆర్థికసాయం అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఇవాళ్టితో చెల్లించిన మొత్తంలో ఇప్పటివరకు 4248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో 35.40 కోట్ల రూపాయలు అందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat