Home / MOVIES / చెర్రీ అభిమానులకు శుభవార్త

చెర్రీ అభిమానులకు శుభవార్త

ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి  దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా… ఆలియాభట్ ,శ్రియా,అజయ్ దేవగన్ ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ .

ఈ మూవీతో చిత్ర నిర్మాత దర్శకుడుతో పాటు హీరోలు రామ్ చరణ్ తేజ్,జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో పాటు మరి ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటకి గానూ బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన తర్వాత ఆ వారి పాపులారిటీ మరింత పెరిగింది. అలాగే ఈ మూవీలో రామ్‌చరణ్ నటనపై ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్  ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే రామ్‌చరణ్‌‌కి ఓ అరుదైన గౌరవం దక్కింది.

అమెరికాలోని ప్రముఖ ఛానెలైన అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రసారమయ్యే ‘గుడ్ మార్నింగ్ అమెరికా’  షోకి అతిథిగా వెళుతున్నాడు. ఈ షో ఫిబ్రవరి 22న మధ్యాహ్నం గం.1కి.. అలాగే రాత్రి గం.11.30కి ప్రసారం అవుతుంది.

ఈ షోకి వెళ్లిన మొదటి భారతీయ నటుడు చెర్రీనే కావడం ఇక్కడ విశేషం.ఆ షోలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అనుభవాలతో పాటు తన తదుపరి చిత్రాల గురించి చెర్రీ మాట్లాడనున్నాడు.

అలాగే వ్యక్తిగత, వృత్తిగత విషయాల గురించి అమెరికా టీవీ ప్రేక్షకులతో పంచుకోనున్నాడు. చరణ్‌కి ఇలాంటి అవకాశం రావడం.. టాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమాకి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందనడానికి చిహ్నం. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat