KANNABABU: ఎల్లో మీడియా చాలా నీచ స్థితికి దిగజారిపోయిందని మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఈనాడు యాజమాన్యం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లు ప్రజలకు తెలిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరంలో పథకం ప్రకారమే పట్టాభి నాటకం ఆడారని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్టే ఈనాడు నడుచుకుంటోందని తెలిపారు.
తెదేపా ప్రతిపక్షంలోకి వచ్చాక పట్టాభిరామ్ ను కావాలనే తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పైనా కావాలనే పెద్ద పెద్ద పేజీలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇవి పసుపు మీడియా రోజులు కావు….సోషల్ మీడియా రోజులు. పట్టాభి పాత ఫోటోలతో ఈనాడులో కథనాలు సృష్టించారని విమర్శించారు. మాపై బురద జల్లినప్పుడు ఇష్టానుసారంగా రాసి….ఇప్పుడు తెదేపా సవరణలు ఇస్తే మాత్రం ఎక్కడో చిన్న పేజీల్లో వేస్తారా అని మండిపడ్డారు.
చంద్రబాబును ముఖ్యమంత్రి…లోకేశ్ ను బాహుబలి చేయాలనేది ఈనాడు తపన అని కన్నబాబు అన్నారు. ఈనాడు అనేది చంద్రబాబు కరపత్రిక లాగా పనిచేస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక భాగం కేటాయించి ముఖ్యమంత్రి జగన్…..సామాజిక విప్లవానికి తెరతీశారని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈనాడు కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాసి సవరణ మాత్రం సింగిల్ కాలమ్ లో వేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు భజన తప్ప మరొకటి ఈనాడుకు తెలియదని మండిపడ్డారు.