Home / SLIDER / ‘ప్రగతి యాత్ర’లో భాగంగా కాలనీలు, బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

‘ప్రగతి యాత్ర’లో భాగంగా కాలనీలు, బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా పాదయాత్ర చేస్తూ వేమన నగర్, శ్రీకృష్ణ నగర్, సోనియా గాంధీనగర్, కార్తిక్ నేచర్ స్పేస్ లలో అభివృద్ధి పనులు పరిశీలించి, అక్కడక్కడా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు.

అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారు అందుకోవాలని సూచించారు. శ్రీరామ్ నగర్ కాలనీలో రూ.3.49 కోట్లతో కొత్తకుంట నుండి పెద్ద చెరువు వరకు చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, రూ.48 లక్షలతో సీసీ రోడ్లు, రూ.1.50 కోట్లతో కొత్త కుంటకు డ్రైనేజీ మళ్లింపు పైపు లైన్ పనులు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు మన్నె బాలేష్, మన్నె రాజు, వారాల వినోద్, యాదిరెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, మధుమోహన్, రెహ్మాన్, దొడ్ల శ్రీనివాస్, అరుణ, చంద్రశేఖర్, హెచ్ఏఎల్ బషీరుద్దిన్, కాసింబి, సుధాకర్ రెడ్డి, ముకుంద రావు, సాజిద్, ప్రభుదాస్, కలీం మరియు బస్తీల వాసులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat