Home / ANDHRAPRADESH / KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: కొడాలినాని

KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: కొడాలినాని

KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరగా చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గన్నవరంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేష్టలకు, సవాళ్లకు ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై బాలకృష్ణ పూనినట్లున్నారని విమర్శించారు. కావాలంటే చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి….కమాండోలను వదులుకుని సవాళ్లకు రావాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. నారాలోకేశ్ పిచ్చి పిచ్చిగా కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని నమ్ముకుని,,,,ప్రజలకై తపించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

చంద్రబాబే ….పట్టాభిని గన్నవరం పంపించారని కొడాలి ఆరోపించారు. అక్కడ ఏ తెదేపా కార్యకర్తకు ఒక చిన్న గీత కూడా పడలేదని స్పష్టం చేశారు, ఇవన్నీ చంద్రబాబు ఆడే నాటకాలని మండిపడ్డారు.

చంద్రబాబు అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని…..అతన్ని తొందరగా పిచ్చాసుపత్రికి గానీ, జైలుకు గానీ తరలించాలని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో ఉంటే ప్రజలకు, రాష్ట్రానికి హాని జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగపు చాటులో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ, పోలీసులను కించపరుస్తున్నారని దుయ్యబట్టారు. లోకేశ్ తన పిచ్చిని చంద్రబాబుకు అంటించారేమో అనే అనుమానం వస్తోంది. చంద్రబాబు బెదిరింపులకు ఎవరూ భయపడటం జరగదనేది తెలుసుకోవాలని పేర్కొన్నారు. గన్నవరంలో పెద్ద హైడ్రామా సృష్టించారని మండిపడ్డారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat