KOPPULA: ట్యాంక్బండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిశీలించారు.11.5 ఎకరాల్లో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోందని…..మంత్రి నిర్మించారు. మొత్తం 125 అడుగుల మేర విగ్రహం నిర్మిస్తున్నారని…..90 శాతం పనులు పూర్తి అయ్యాయని మంత్రి అన్నారు. అంబేడ్కర్ వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఆలోచనా విధానాన్ని ప్రభుత్వం చేతల్లో చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్లో అంబేడ్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు.
విగ్రహం కింది భాగంలో అంబేడ్కర్ ఫోటో గ్యాలరీతోపాటు జీవిత చరిత్రను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.125 అడుగుల ఎత్తు, 45.5 అడుగుల వెడల్పుతో విగ్రహం ఉంటుందన్నారు. విగ్రహం చుట్టూ ఎలివేషన్, స్మృతివనం, సెంట్రల్ లైబ్రరీ, ఫౌంటెన్ నిర్మిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు.
పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్……రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారని ప్రస్తావించారు. సీఎం సారథ్యంలో రాష్ట్రం దూసుకుపోతోందని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కూడా పనిచేస్తున్నరని స్పష్టం చేశారు.