Home / ANDHRAPRADESH / ROJA: ప్రజలు లోకేశ్ ను పిచ్చివాడిలా చూస్తున్నారు: మంత్రి రోజా

ROJA: ప్రజలు లోకేశ్ ను పిచ్చివాడిలా చూస్తున్నారు: మంత్రి రోజా

ROJA: ప్రజలు నారా లోకేశ్ ను పిచ్చివాడిలా చూస్తున్నారని మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారని ప్రజలే అతని చూసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే కాదు….పార్టీ కార్యకర్తలు , నేతలు కూడా అక్కడి నుంచి పారిపోతున్నారని విమర్శించారు. పాదయాత్రలో కనీసం 20 మంది కూడా లేరని….అది పెయిల్యూర్ యాత్ర అని రోజా మండిపడ్డారు. ప్రజలను అడిగితే వాస్తవాలు చెబుతారు గానీ….ఎవరో యాంకర్ ను పెట్టుకంటే తెదేపా మాటలే తప్ప ఇంకేమోస్తాయని విమర్శించారు.

ఎవరో స్ర్కిప్తు ఇస్తే చదవడం తప్ప లోకేశ్ కు మరొకటి చేతకాదని రోజా మండిపడ్డారు. అంతేకాదు ప్రజల్లో మమెకమైనట్లు డ్రామాలు చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. లోకేశ్ చేస్తున్న ప్రతి పని విఫలమవుతోందని రోజా అన్నారు. తెదేపాకు యువగళం….యమగళంగా మారిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నందమూరి కుటుంబంపై ప్రేమ పుడుతుందని విమర్శించారు.

నందమూరి కుటుంబాన్ని కరివేపాకులా వాడుకని…..మళ్లీ అధికారంలోకి వచ్చాక వాళ్లని పట్టించుకోకపోవడం చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు. నందమూరి కుటుంబం ఒకసారి పునరాలోచించాలని రోజా హితవు పలికారు. భారాసకు వెయ్యికోట్లకు అమ్ముడుపోయాడన్న వార్తలపై ఎందుకు నోరు మెదపట్లేదని మంత్రి రోజా ప్రశ్నించారు.

లోకేశ్, పవన్ కల్యాణ్ వల్ల ఉపయోగం లేదనిఎక్కడ అధికారం చేజారిపోతుందనే భయంతోనే జూ. ఎన్టీఆర్ ను పిలుస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ఎన్టీఆర్, హరికృష్ణకు ఎలా అన్యాయం జరిగిందో జూ.ఎన్టీఆర్ మరచిపోరని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్ లు పార్టీని లాక్కున్న దొంగలని మంత్రి రోజా విమర్శించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat