NARAYANA: తెదేపా నేత నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పదో తరగతి పరీక్షా పత్రం లేకేజీ కేసులో సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును మాత్రం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.
మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నారాయణ విద్యాసంస్థలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని నారాయణ తరపు న్యాయవాది వాదించారు. ర్యాంకుల కోసం ప్రశ్నాపత్రం లీకేజీ చేస్తున్నారని……దాంతో పబ్లిసిటీ చేసుకుంటున్నారనే ఆరోపణలు నారాయణపై ఉన్నాయి.
సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరపాలని సుప్రీం స్పష్టం చేసింది. బెయిల్ రద్దుపై సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై 7 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది. అయితే అప్పటివరకు నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశాలిచ్చింది.
అయితే ఎప్పటినుంచో నారాయణ విద్యాసంస్థలపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ర్యాంకులు రావాలనే ఒత్తిడితో చదివిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకో విషయం ఈ విద్యాసంస్థల్లో ఒత్తిడికి తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది అందిరికీ తెలిసిన వాస్తవం. విద్యాసంస్థలపై ఆది నుంచి వివాదాలు ఉన్నాయి. బాగా చదివే వారిని మాత్రమే ఎంచుకుంటారని…..వారి కోసం పేపర్ లీకేజీ చేసి ర్యాంకులు తెప్పించేలా చేస్తారనేది ప్రజలనే మాట. పేపర్ లీకేజీ కేసులో సుప్రీం నిర్ణయంతో నారాయణకు వారం పాటు అరెస్టు నుంచి ఊరట దక్కింది.