రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా వచ్చేనెల నుంచి బలవర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 2 కిలోల గోధుమపిండిని అందించబోతున్నాము..త్వరలోనే రాష్ట్రమంతా ప్రారంభిస్తామని తెలిపారు.
వచ్చే 2 నెలల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేస్తాము.. వీటి సరఫరాకు కేంద్రమంత్రి గోయల్ అంగీకరించారని ఆయన పేర్కొన్నారు.